ప్రగతి ప్రయాణానికి పదకొండేళ్లు
26 మే 2014.. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. అంతకుముందు పదేళ్ల యూపీఏ పాలనలో వరుస కుంభకోణాలు.. అంతులేని అవినీతి.. అశ్రిత పక్షపాతం.. నిర్ణయ రాహిత్యం రాజ్యమేలిన తరుణంలో యావత్ భారత ప్రజానీకం ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో బిజెపిపై, నరేంద్ర మోదీపై నమ్మకం ఉంచారు.. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, నీతి, నిజాయితీలను పాదుకొల్పిన నరేంద్ర మోదీ.. ప్రజల అంచనాలను మించే అభివృద్ధి చూపించారు..
అప్పుడు ప్రజలెవరూ ఊహించలేదు.. ప్రభుత్వం అందించే ప్రయోజనం నూటికి నూరు శాతం లబ్ధిదారుడుకు చేరుతుందని.. డీబీటీ (నగదు బదిలీ)తో అదిప్పుడు సాధ్యమయ్యింది.. అప్పుడెవరూ ఊహించలేదు మూరుమూల పల్లెలో నివసించే పేదవాడి ఇంటిలోనూ ప్రత్యేక మరుగుదొడ్డి ఉంటుందని.. స్వచ్ఛ భారత్ తో అదిప్పుడు సాధ్యమైంది.. అప్పుడెవరూ ఊహించలేదు పేదవాడికి బ్యాంకింగ్ సేవలందుతాయని.. జన్ ధన్ యోజనతో అదిప్పుడు సాధ్యమైంది.. అప్పుడెవరూ ఊహించలేదు రకరకాల పన్నుల చిక్కుముడులు తొలగిపోతాయని.. జీఎస్టీతో ఒకే దేశం ఒకే పన్ను సాధ్యమైంది.. అప్పుడెవరూ ఊహించలేదు దేశంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని.. ఆయుష్మాన్ భారత్ తో అదిప్పుడు సాధ్యమైంది..
అంతేకాదు, ఉజ్వల యోజనతో పేద కుటుంబంలోనూ గ్యాస్ పొయ్యిలొచ్చాయి.. హర్ ఘర్ నల్ సే జల్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు వచ్చాయి.. రోడ్లు, రైల్వేలు, వైమానిక రంగంలో మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి.. సర్జికల్ స్టైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదానికి మునుపెన్నడూ లేని రీతిలో దేశం కఠినంగా వ్యవహరిస్తున్నది.. దేశంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.. ప్రపంచ తయారీరంగానికి భారత్ గమ్యస్థానంగా మారుతోంది.. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది.. విదేశీ వ్యవహారాల్లో భారత్ ప్రాధాన్యత పెరిగింది.. ఇలా చెప్పుకుంటూ అదో పెద్దగ్రంథం అవుతుంది.. అందులో కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం..
పేదలు, అణగారిన వర్గాలకు సేవ
- 81+ కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత ఆహార ధాన్యాలు
- స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం
- 15+ కోట్లకు పైగా గృహాలకు నల్లా కనెక్షన్లు
- PMAY కింద 4+ కోట్లకు పైగా ఇళ్లు పూర్తి
- ప్రధానమంత్రి స్వనిధి కింద 68 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు జారీ
- ముద్రా యోజన కింద చిన్న పారిశ్రామికవేత్తలకు 52.5 కోట్ల రుణాలు జారీ
- జాతీయ వెనకబడిన తరుగుల కమిషన్ కు రాజ్యాంగ హోదా
- 20 కోట్ల మంది మహిళలకు కోవిడ్ లాక్ డౌన్ సమయంలో నగదు బదిలీ
- స్టాండప్ ఇండియా కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.14,700 కోట్లకు పైగా రుణాలు
- ప్రస్తుత మంత్రివర్గంలో 60% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే
- 2014 నుంచి నాలుగు కన్నా ఎక్కువ సార్లు ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరయ్యాయి
- అభివృద్ధిలో 112 ఆకాంక్ష జిల్లాలు ఆయా రాష్ట్రాల సగటును అధిగమించాయి
- మోదీ రాక ముందు కేంద్రం రూ.1 పంపిస్తే, లబ్ధిదారుకు చేరేది 15 పైసలే
- నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ ఫాంల ద్వారా ఇప్పుడు ప్రభుత్వ పథకాల ప్రయోజనం పూర్తిగా అనుకున్న సమయానికి నేరుగా లక్షిత లబ్ధిదారుడికి చేరుతుంది.
రైతు సంక్షేమానికి భరోసా
- 2013-14తో పోలిస్తే 2025-26లో వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెరిగింది
- వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా రూ.1లక్ష కోట్లు పంపిణీ అయ్యాయి
- పీఎం కిసాన్ యోజన కింద రూ.3.7 లక్షల కోట్లు రైతులకు పంపిణీ అయ్యాయి
- దాదాపు 25 కోట్ల మంది లబ్ధిదారులు సాయిల్ హెల్త్ కార్డులను అందుకున్నారు
- కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారు
- రూ.1.75+ లక్షల కోట్లు పీఎం ఫసల్ బీమా యోజన కింద 2025-26లో పంపిణీ అయ్యాయి
- 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం
- 2021-26 సంవత్సరానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కోసం రూ93,000+ కోట్లు కేటాయింపులు జరిగాయి
- 1,473 మండీలు e-NAM (ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్) ద్వారా అనుసంధానమయ్యాయి
- అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ కోసం రూ.100 కోట్లు కేటాయింపులు
నారీ శక్తికి నూతనోత్తేజం
- భారతదేశంలో తొలిసారి లింగ నిష్పత్తిలో 1,000 మంది పురుషులకు 1,020 మంది మహిళలకు మెరుగుపడింది (NFHS-5)
- 12 వారాల నుండి 26 వారాలకు పెరిగిన వేతన ప్రసూతి సెలవులు, ఉద్యోగం చేసే మాతృమూర్తులకు రెట్టింపు మద్దతు
- గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కింద 6+ కోట్లకు పైగా ఉచిత ప్రసూతి పరీక్షలు నిర్వహించారు
- పీఎం మాతృ వందన యోజన (PMMVY) కింద 3.98 కోట్ల గర్భిణీలు, బాలింతలకు రూ.18,593 కోట్లు పంపిణీ అయ్యాయి
- ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా 4.2 కోట్ల సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరుచుకున్నాయి
- ఉజ్వల యోజన కింద 10.33+ కోట్లకు పైగా పొగ రహిత వంటగదులు ఏర్పడ్డాయి
- జన ఔషధి కేంద్రాల ద్వారా రూ.1కే శానిటరీ ప్యాడ్లు అందుబాటులోకి వచ్చాయి, ఇప్పటివరకు 77+ కోట్ల ప్యాడ్ లు ఈ కేంద్రాల నుంచి తీసుకున్నారు
- 35.38 కోట్లు (68%) ముద్ర రుణాల ద్వారా రూ.14.72 లక్షల కోట్లు మహిళా వ్యవస్థాపకులకు మంజూరయ్యాయి
- ప్రధానమంత్రి ఆవాస్-గ్రామీణ గృహాలలో 73% అంటే దాదాపు 2.75 కోట్ల ఇళ్లు మహిళా లబ్ధిదారులకు కేటాయించారు
- మాతృ మరణాల రేటు 2023లో 80కి తగ్గింది
- 33% మహిళా రిజర్వేషన్లు లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యానికి భరోసానిస్తుంది
అమృతకాల తరం సశక్తీకరణ
- 30 సంవత్సరాల తర్వాత జాతీయ విద్యా విధానం 2020 అమలులోకి వచ్చింది
- టాప్స్ కోర్ గ్రూప్లో 94 మంది, డెవలప్మెంట్ గ్రూప్లో 112 మంది అథ్లెట్లు టాప్స్ ప్రోగ్రామ్ కింద మద్దతు పొందారు
- టోక్యో, పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్లలో భారతదేశం 61 పతకాలను గెలుచుకుంది
- 1.6 కోట్ల మంది పీఎం కౌశల్ వికాస్ యోజన కింద శిక్షణ పొందారు
- 8 కొత్త IIMల ప్రారంభంతో 2025 నాటికి మొత్తం 21 IIMలు
- మూడు రెట్లు పెరిగిన AIIMS – ఇప్పుడు భారతదేశంలో 23 AIIMS
- 7 కొత్త IITల ప్రారంభంతో దేశవ్యాప్తంగా మొత్తం 23 IITలు
- మొత్తం 2,045 వైద్య కళాశాలలు, వీటిలో 780 అల్లోపతి, 323 డెంటల్, 942 ఆయుష్ సంస్థలు.
- పీఎం శ్రీ యోజన కింద అప్గ్రేడ్ అవుతోన్న 14,500 పాఠశాలలు
- దేశవ్యాప్తంగా 490 కొత్త విశ్వవిద్యాలయాలు ప్రారంభం
- DPIIT గుర్తింపు పొందిన టెక్ స్టార్టప్ల ద్వారా 4.8+ లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టి (2017-2024)
మధ్యతరగతికి సులభతర జీవనం
- కొత్త పన్ను విధానం కింద రూ.12.75 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పూర్తి పన్ను రాయితీ
- నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అన్లాక్ చేసేందుకు SWAMIH నిధి కింద రూ.37,000 కోట్లు
- కేవలం 22 నెలల్లోనే దేశంలోని 99.6% జిల్లాల్లో 5G అందుబాటులోకి వచ్చింది
- దేశవ్యాప్తంగా రేరా ద్వారా 1+ లక్షల కేసుల పరిష్కారం
- 2,297+ ప్రభుత్వ సేవలు UMANG యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి
- ఇప్పుడు 46 కోట్ల మంది వ్యక్తులు, 6.5 కోట్ల మంది వ్యాపారులకు చేరువగా UPI వినియోగదారులు
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా పట్టణ, గ్రామీణ ఇళ్ళు
- 52.14 కోట్లకు పైగా డిజిలాకర్ వినియోగదారులు
- ఉడాన్ కింద 1.50 కోట్ల మందికి సరసమైన విమాన ప్రయాణం లభించింది
- 97% తగ్గిన ఇంటర్నెట్ డేటా ఖర్చు
- అన్ని నగరాలు ఇప్పుడు ODF (బహిరంగ మలవిసర్జన రహితం)
అందరికీ అందుబాటులో సరసమైన వైద్యం
- ఆయుష్మాన్ భారత్ కింద 9+ కోట్ల మంది ఆసుపత్రిలో చేరడంతో ఉచితంగా లభించిన రూ.1.3+ లక్షల కోట్ల విలువైన చికిత్సలు
- 6.78+ కోట్లకు పైగా తల్లులు, బిడ్డలకు మిషన్ ఇంద్రధనుష్ ద్వారా భద్రత
- 1.76+ లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు 377 కోట్లకు పైగా సందర్శనలు
- ఆయుష్మాన్ భారత్ వయ వందన కింద నమోదు చేసుకున్న 58 లక్షల+ సీనియర్ సిటిజన్లు, వీరికి రూ.496 కోట్ల విలువ గల 2.67 లక్షల+ చికిత్సలను అందించారు
- 16,000+ జన ఔషధి కేంద్రాలు పేదలకు మార్కెట్ ధర కంటే 50-90% తక్కువ ధరకు మందులను అందిస్తున్నాయి
- 6+ కోట్ల మంది అమృత్ ఫార్మసీల నుండి సరసమైన ధరలకు మందులను కొనుగోలు చేశారు
- 220+ కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు
- 2014 నుండి MBBS సీట్లు 1.18 లక్షలకు పెరిగాయి, కొత్తగా 74,000 పీజీ సీట్లు వచ్చాయి
- 77+ కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతాలు తెరుచుకున్నాయి
- 1,500+ PSA (ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్) ప్లాంట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
- జన ఔషధి కేంద్రాల కింద రూ.38,000 కోట్లు ఆదా అయ్యాయి
- ఈసంజీవని ద్వారా 37+ కోట్ల టెలికన్సల్టేషన్లు
దేశమే ప్రథమ ప్రాధాన్యం – జాతీయ భద్రత, విదేశీ దౌత్యం
- ఆపరేషన్ సిందూర్ భారతదేశం వేగవంతమైన, సార్వభౌమ ప్రతిస్పందనను ప్రదర్శించింది
- 5,000+ వస్తువులు రక్షణ స్వదేశీకరణ జాబితాలో జోడించారు
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ కొనుగోళ్ల కోసం కేటాయించిన మూలధన బడ్జెట్లో 75% దేశీయ ఉత్పత్తుల కోసమే
- ఆపరేషన్ కావేరీ కింద ఘర్షణలతో సతమతమవుతోన్న సూడాన్ నుండి 3,000+ భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు
- 3.15+ కోట్లు ప్రయాణీకులకు వందే భారత్ విమానాలు, ఎయిర్ బబుల్ ఏర్పాట్ల ద్వారా సదుపాయాలు కల్పించారు
- 23,000 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించారు
- రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరుకున్న 2024-25లో రక్షణ ఎగుమతులు
- భారత రాజ్యాంగం నుండి ఆర్టికల్ 370, 35A రద్దు
- 2014 నుండి రక్షణ ఎగుమతుల్లో 34 రెట్లు పెరుగుదల; ఆటోమేటిక్ మార్గం ద్వారా రక్షణలో 74% FDIకి అనుమతి
- సాయుధ దళాల కోసం iDEX స్టార్టప్లు, MSMEల నుండి రూ.2,400 కోట్లకు పైగా విలువైన 43 వస్తువుల సేకరణ
- వ్యాక్సిన్ మైత్రి కింద 100+ దేశాలకు 30+ కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్లు సరఫరా అయ్యాయి
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును 7 రక్షణరంగ PSUలుగా మార్చారు, వాటిలో ఆరు లాభాలలో ఉన్నాయి
భారత్, ప్రపంచ ఆర్థికానికి శక్తికేంద్రం
- 6.3 నుండి 6.8% వృద్ధిరేటుతో 2025-26లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని అంచనా
- సెప్టెంబర్ 2024లో స్థూల FDI ప్రవాహాలు 1 ట్రిలియన్ అమెరికా డాలర్లకు చేరుకున్నాయి
- ప్రపంచ రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీలలో 49% భారతదేశంలోనే జరిగాయి (ACI Worldwide Report 2024)
- 2024-25 మొదటి అర్ధభాగంలో FDIలో 26% వృద్ధి; 42+ బిలియన్ల అమెరికా డాలర్లకు చేరుకున్న FDIలు
- కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థను కాపాడిన రూ.29.8 లక్షల కోట్లు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 825 బిలియన్ అమెరికా డాలర్ల విలువ గల వస్తువులు, సేవల ఎగుమతులు
- ECLGS కింద MSMEలకు రూ.3.68+ లక్షల కోట్లు మంజూరు అయ్యాయి
- డిసెంబర్ 2024లో GNPAS 2.6%కి తగ్గడంతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం అయింది
- MCGS-MSME కింద గ్యారంటీ కవర్ రూ.100 కోట్లకు పెరిగింది
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పెట్రోలియమేతర ఎగుమతులు 374.1 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకున్నాయి
- ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతుల్లో 32% కంటే ఎక్కువ వృద్ధి, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 38+ బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకున్నాయి
- PLI పథకం రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ.14 లక్షల కోట్ల ఉత్పత్తి, రూ.5.31 లక్షల కోట్ల ఎగుమతులు, 11.5 లక్షల ఉద్యోగాల సృష్టిని సాధించింది
సులభతర వ్యాపారం
- ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో 79 ర్యాంకులు మెరుగుదల (2014లో 142 నుండి 2019లో 63కి)
- 1,500+ పురాతన చట్టాలు రద్దు, 45,000+ సమ్మతులు హేతుబద్ధీకరణ
- ఏంజెల్ టాక్స్ & రెట్రోస్పెక్టివ్ టాక్స్ రద్దు
- కంపెనీ సెటప్ కోసం SPICe+ ఫారమ్ 10 సేవలను ఒకదానిలో సమ్మిళితం చేస్తుంది
- 2023-24లో 1.8 లక్షలకు పైగా కొత్త కంపెనీలు నమోదయ్యాయి (16% వృద్ధి)
- స్టార్టప్ల సంఖ్య 1.6 లక్షలు దాటి 17.6 లక్షల ఉద్యోగాలను సృష్టించింది
- ఇప్పుడు ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా భారతదేశం
- అప్పుడు సులభతర వ్యాపారంలో 142వ ర్యాంకు, లాజిస్టిక్స్ ర్యాంక్: 54, గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్: 81 – నిదానం, అధికారస్వామ్యం
- ఇప్పుడు సులభతర వ్యాపారం ర్యాంకు 63, లాజిస్టిక్స్ ర్యాంకు 38, గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకు 39- సంస్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో అగ్ర స్థానంలో ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్
వేగంగా, భారీగా మౌలిక వసతులు
- 3.96 లక్షల కి.మీ గ్రామీణ రోడ్లు నిర్మితమయ్యాయి, 99% గ్రామీణ రోడ్ కనెక్టివిటీ
- 86 విమానాశ్రయాలు కార్యాచరణలోకి వచ్చాయి; విమాన సేవలు అందుబాటులో లేని 88 ప్రాంతాలను ఉడాన్ అనుసంధానించింది
- మెట్రో నెట్వర్క్ 248 కి.మీ (2014) నుండి 1013 కి.మీ (2025) కు విస్తరించింది
- 3600 కి.మీ హై-స్పీడ్ కారిడార్లు నిర్మితమయ్యాయి, ఇప్పుడు రోజుకు 34 కి.మీ. చొప్పున హైవే నిర్మాణం
- 400 ప్రపంచ స్థాయి వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి, 136 ఇప్పటికే పట్టాలపై పరుగులు పెడుతున్నాయి
- రూ.100 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్
- అటల్ టన్నెల్, చీనాబ్ వంతెన, ఐక్యతా విగ్రహం వంటి ఐకానిక్ నిర్మాణాలను నిర్మించారు
- 2014 నుండి రైల్వే బడ్జెట్ 9 రెట్లు పెరిగింది
- 363+ ప్రాజెక్టులను ప్రగతి సమావేశాల ద్వారా సమీక్షించిన ప్రధాని మోదీ
- అమృత్, అమృత్ 2.0 కింద 6933 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయి
- జాతీయ జలమార్గాల చట్టం, 2016 ప్రకారం 111 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించారు
- 2014 నుండి 2023-24 వరకు రోడ్డు రవాణా, హైవే బడ్జెట్ కేటాయింపులలో 570% పెరుగుదల
భారత సాంకేతిక దశకం
- 2025 నాటికి భారతదేశంలో 116 కోట్ల మొబైల్ సబ్స్క్రైబర్లు
- 2.14 లక్షల గ్రామ పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానం
- డేటా ధరలు రూ.308/GB నుండి రూ.9.34/GBకి తగ్గాయి
- నేరుగా పేదలకు, లబ్ధిదారులకు రూ.44 లక్షల కోట్ల నగదు బదిలీ
- ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ (GeM) పోర్టల్లో 13.41 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు
- 51% స్టార్టప్లు టైర్ 2, టైర్ 3 నగరాల నుండే వచ్చాయి
- 2025 ఏప్రిల్ లో 24 లక్షల కోట్ల విలువైన UPI లావాదేవీలు
- ప్రపంచంలోని రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీలలో 49% భారతదేశంలోనే
- గత 11 సంవత్సరాలలో 285% పెరిగిన ఇంటర్నెట్ వినియోగదారులు
- డిజిటల్ ఇండియా కింద పనిచేస్తున్న 5.76 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు
- భారత్నెట్ ప్రాజెక్ట్ కింద 6.93 లక్షల కి.మీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్
- ఇస్రో ఒకే మిషన్లో 104 ఉపగ్రహాలను ప్రయోగించింది, ఇది అపూర్వమైన ప్రపంచ రికార్డు
ఈశాన్యం : అభివృద్ధి ఇంజన్
- AFSPA ప్రభావిత ప్రాంతాలలో 75% తగ్గుదల
- 16 సంవత్సరాల జాప్యం తర్వాత పూర్తయిన బోగిబీల్ వంతెన
- బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ల ద్వారా అన్ని రాష్ట్ర రాజధానుల అనుసంధానం
- బోడో శాంతి ఒప్పందం (2020), నాగా, కర్బి, NLFT (SD), గిరిజన సమూహాలు, DNLF, ULFA, NLFT, ATTF లతో శాంతి ఒప్పందాల ద్వారా ఈశాన్యంలో శాంతి
- గత 11 సంవత్సరాలలో 10 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మాణం
- ఈశాన్య ప్రాంతం కోసం మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ కింద, 434 రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పడ్డాయి, ఇవి 1.73 లక్షల హెక్టార్లకు విస్తరించి 2.19 లక్షల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి
- 5,000 కి.మీ.కు పైగా రోడ్డు ప్రాజెక్టులు పూర్తయ్యాయి
- ఈ ప్రాంతానికి మొత్తం రూ.44,859 కోట్ల వ్యయంతో 3,613 ప్రాజెక్టులకు ఆమోదం
- జాతీయ వెదురు మిషన్ ప్రారంభం, వెదురు, అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం
- అస్సాంలో 15 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు
- 3.3 లక్షల మంది అటవీ సంగ్రాహకులకు ప్రయోజనం చేకూరుస్తోన్న వన్ ధన్ పథకం
భారతీయ సంస్కృతికి పునర్వైభవం
- ప్రపంచ స్థాయి కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ లోక్ ప్రాజెక్ట్
- 2014 నుండి చోరీ అయిన 642 కళాఖండాలు తిరిగి స్వదేశానికి తీసుకువచ్చారు, 2013 వరకు 13 మాత్రమే స్వదేశానికి తీసుకువచ్చారు
- రూ.3.5 కోట్ల వ్యయంతో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ప్రాజెక్టు
- అయోధ్యలో శ్రీరామ మందిరం అద్భుత నిర్మాణం
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని గుర్తుచేసే సాంస్కృతిక, దేశభక్తి వేడుకలు
- ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న 12.4 కి.మీ. హేమకుండ్ సాహిబ్ రోప్వే ప్రాజెక్ట్ పనులు
- రూ.207.3 కోట్ల పెట్టుబడితో కేదార్నాథ్ పునరాభివృద్ధి ప్రాజెక్టు
- జాతీయ యుద్ధ స్మారక చిహ్నం, జాతీయ పోలీసు స్మారక చిహ్నం, ప్రధానమంత్రి మ్యూజియం నిర్మాణం
- సిక్కు యాత్రికుల కోసం కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవం
- ప్రసాద్ పథకం కింద సాంస్కృతిక ప్రదేశాల అభివృద్ధి కోసం రూ.1,900 కోట్లు పెట్టుబడి
- స్వదేశ్ దర్శన్ పథకం కింద 76 ప్రాజెక్టుల అభివృద్ధి
- వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 – వక్ఫ్ ఆస్తుల పారదర్శకత, జవాబుదారీతనం, డిజిటల్ నిర్వహణ కోసం పటిష్టమైన ఆన్లైన్ పోర్టల్
- చార్ ధామ్ హైవే కనెక్టివిటీ ప్రోగ్రామ్ కింద 825 కి.మీ జాతీయ రహదారుల అభివృద్ధి
- హృదయ్ పథకం కింద 12 వారసత్వ నగరాల అభివృద్ధి
పర్యావరణం, సుస్థిరత
- ప్రాజెక్ట్ చీతా ప్రపంచంలోనే మొట్టమొదటి పెద్ద క్రూర మృగ ఖండాంతర ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్
- 16 NDRF బెటాలియన్లు, బలమైన మౌలిక సదుపాయాలు, డయల్ 112 అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థతో భారతదేశం రూ.46,000 కోట్ల విపత్తు నిర్వహణ నిధిని సృష్టించింది
- శిలాజేతర ఇంధన శక్తి కోసం COP21 లక్ష్యాల షెడ్యూల్ కంటే 9 సంవత్సరాలు ముందుగానే సాధించాం
- 2014 నుండి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం దాదాపు మూడు రెట్లు పెరిగింది
- 2014 నుండి ఇన్ స్టాల్డ్ సౌరశక్తి సామర్థ్యంలో 3,645% వృద్ధి
- రాజస్థాన్లోని భడ్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ (2,245+ MW) ప్రారంభం
- పీఎం-కుసుమ్ కింద 49 లక్షల వ్యవసాయ పంపులను సోలరైజేషన్ చేశారు
- ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద 142+ కోట్ల మొక్కలను నాటారు
- 13 భారతీయ బీచ్లకు ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది
- ఉజాలా పథకం కింద 36.87 కోట్ల LED బల్బుల పంపిణీ

