జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
Posted On February 19, 2024

35 ఏళ్లకు పైగా బిజెపి కార్యకర్తలకు హస్తభూషణంగా మారిన జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ ప్రారంభమైంది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ బిజెపి కార్యకర్తలకే కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. జనసందేశ్ బృందానికి జి. కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
