ఎమ్మెల్సీ బరిలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
Posted On May 16, 2024

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఖరారయ్యారు. ఈమేరకు మే 9న నల్గొండలో నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్. రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

